మల్టీ టాస్కింగ్ (నాన్-టెక్నికల్) స్టాఫ్
|
ప్రిపరేషన్ విధానం
|
కేంద్ర ప్రభుత్వ శాఖల్లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్
(నాన్-టెక్నికల్) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ)
జాతీయ స్థాయిలో రాత పరీక్ష నిర్వహిస్తుంది. కేవలం పదో తరగతి అర్హతతో చిన్న
వయసులోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సంపాదించే అవకాశం లభిస్తున్న ఈ పరీక్షకు
ఎలా సిద్ధం కావాలి? ఎంపిక విధానం తదితర వివరాల గురించి తెలుసుకుందాం.
|
మల్టీ టాస్కింగ్ (నాన్-టెక్నికల్) స్టాఫ్ అంటే ఎవరు ?
కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ప్యూన్, డాఫ్టరీ, జూనియర్
జెస్టెట్నర్ ఆపరేటర్, ఫరాష్, చౌకీదార్, మాలి తదితర పనులు నిర్వహించే
వారిని మల్టీ టాస్కింగ్ (నాన్-టెక్నికల్) స్టాఫ్ అంటారు. వీరిని 2010 వరకు
గ్రూప్-డి కేటగిరీ కింద పరిగణించే వారు. కేంద్ర ప్రభుత్వం 2010 ఏప్రిల్లో
చేసిన మార్పుల వల్ల వీరిని గ్రూప్-సి కిందకు చేర్చారు. అప్పటినుంచి వీరు
గ్రూప్-సి ఉద్యోగులుగా మారారు.
అర్హతలు
భారతీయులై, పదో తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై
ఉండాలి. వయసు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఫీజు నిమిత్తం జనరల్,
ఓబీసీ కేటగిరీల అభ్యర్థులు రూ.100లకు సెంట్రల్ రిక్రూట్మెంట్ ఫీ స్టాంపుల
రూపంలో దరఖాస్తుపై అతికించాల్సి ఉంటుంది. వీటిని అన్ని హెడ్ పోస్టాఫీసుల్లో
పొందవచ్చు. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, శారీరక వికలాంగులు, ఎక్స్-సర్వీస్మెన్
అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. |
ఎంపిక విధానం
అభ్యర్థులను రెండు రకాల పరీక్షల ద్వారా ఎంపిక చేస్తారు.
మొదట ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. దీన్లో అర్హత సాధించిన
వారికి రెండో పరీక్ష నిర్వహిస్తారు. ఇది డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది.
పరీక్ష విధానం
పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1 ఆబ్జెక్టివ్ విధానంలో, పేపర్-2 డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది.
పేపర్-1 అంశాలు
|
పేపర్ - 1
సహజంగా ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఉంటుంది. అభ్యర్థుల
సౌకర్యార్థం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రాంతీయ భాషలో కూడా పరీక్ష రాసే
అవకాశాన్ని కల్పిస్తోంది.
పేపర్ - 2
ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. పేపర్-1లో కమిషన్ సూచించిన
కటాఫ్ మార్కులు పొందిన వారిని మాత్రమే పేపర్-2కు పిలుస్తారు. అభ్యర్థికి
లాంగ్వేజ్ స్కిల్స్ ఎలా ఉన్నాయో పరిశీలించడమే పేపర్-2 ఉద్దేశం.
|
పేపర్-1 సిలబస్ - ప్రిపరేషన్ విధానం
పరీక్ష జాతీయ స్థాయిలో జరిగినా
సిలబస్ పదో తరగతి స్థాయిలోనే ఉంటుంది కాబట్టి ప్రశ్నలు మరీ లోతుగా,
క్లిష్టంగా ఉంటాయని అనుకోవద్దు. మౌలిక అంశాలపై పూర్తి అవగాహన ఏర్పర్చుకుంటే
ప్రశ్న ఎలా వచ్చినా సాధించగలుగుతారు. అంతేకాదు పరీక్షను ప్రాంతీయ భాషలో
కూడా రాసే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు పేపర్-1 గురించి ఆందోళన
చెందాల్సిన పనిలేదు.
|
దీన్లో ప్రాబ్లమ్ సాల్వింగ్, ఎనాలసిస్, జడ్జిమెంట్, డెసిషన్ మేకింగ్, విజువల్ మెమరీ, రిలేషన్షిప్ కాన్సెప్ట్స్, అరిథ్మెటికల్ నంబర్ సిరీస్, నాన్-వెర్బల్ సిరీస్ తదితర అంశాలుంటాయి. సింబల్స్ వాటి మధ్య సంబంధాలు, ఎనలిటికల్ఫంక్షన్స్, అరిథ్మెటికల్ నాలెడ్జ్ అభ్యర్థికి ఏ స్థాయిలో ఉందో పరిశీలించడమే ఈ విభాగం ఉద్దేశం.
ప్రిపరేషన్
ఈ విభాగానికి 25 మార్కులు కేటాయించారు. దీన్లో కీలకమైన అంశం
ప్రశ్నకు సంబంధించిన లాజిక్ను గుర్తించడమే. ప్రశ్నను అర్థం చేసుకుంటూ
రెండుసార్లు చదివితే తర్కాన్ని గమనించవచ్చు. దీనికోసం మొదట సిలబస్
మొత్తాన్ని అర్థం చేసుకోవాలి. మౌలిక అంశాలపై పూర్తి పట్టు సాధించాలి.
తర్వాత ఒక్కొక్క టాపిక్పై ఇచ్చే విభిన్న ప్రశ్నలను సాధించాలి. అధిక
మార్కుల కోసం గత పరీక్ష పేపర్లు, మోడల్ పేపర్లను బాగా సాధన చేయాలి. ఈ
విభాగాన్ని ఎంత ఎక్కువగా సాధన చేస్తే అంత తక్కువ సమయంలో సమాధానాలను
గుర్తించడానికి వీలుంటుందని అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. అంటే సమాధానాలను
వేగంగా గుర్తించగలిగే నేర్పును అభ్యర్థులు నేర్చుకుంటారు. ఈ ఏ పోటీ
పరీక్షలోనైనా వేగం, కచ్చితత్వం చాలా అవసరం. అందువల్ల ఈ విషయాన్ని ఎప్పుడూ
గుర్తుంచుకోవాలి.
బి) న్యూమరికల్ ఆప్టిట్యూడ్
దీన్లో సంఖ్యామానం, దశాంశాలు, భిన్నాలు, సంఖ్యలు- సంబంధాలు,
శాతాలు, నిష్పత్తి - అనుపాతం, సగటులు, వడ్డీ, లాభ నష్టాలు, డిస్కౌంట్లు,
టేబుల్స్, గ్రాఫ్స్, కొలతలు, కాలం - దూరం, కాలం - నిష్పత్తి, కాలం - పని
మొదలైనవి ఉంటాయి.
ప్రిపరేషన్
ఈ విభాగానికి 25 ప్రశ్నలు ఉంటాయి. తక్కువ ప్రశ్నలు
కేటాయించడాన్ని అభ్యర్థులు ఒక సదవకాశంగా భావించాలి. ఈ విభాగం కింద
పేర్కొన్న టాపిక్ల సూత్రాలపై అవగాహన ఏర్పర్చుకుని ఎక్కువ ప్రశ్నలను
షార్ట్కట్ పద్ధతులు పాటిస్తూ సాధన చేస్తే 25కి 25 మార్కులను సొంతం
చేసుకోవచ్చు. దీనికోసం ఆరు నుంచి పదో తరగతుల్లోని మ్యాథమెటిక్స్
పాఠ్యాంశాలను పూర్తిగా అభ్యసించాలి. ప్రశ్నలను ఉదాహరణలతో సాధన చేయాలి.
అభ్యర్థులు ముందుగా గుణకారం, భాగహారం, కసాగు కట్టడం లాంటి ప్రాథమిక
ప్రక్రియలను తక్కువ సమయంలో వచ్చే విధంగా ప్రాక్టీస్ చేయాలి. అలాగే
టేబుల్స్, గ్రాఫ్స్ మొదలైన వాటిని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే తక్కువ సమయంలో
ఎక్కువ ప్రశ్నలు సాధించడానికి వీలుంటుంది. నంబర్లు, సరాసరి, నిష్పత్తులు,
లాభనష్టాలు మొదలైన ప్రాథమిక అంశాలను బాగా సాధన చేయాలి. పరీక్షలో ఈ
విభాగాన్ని చివరగా ఆన్సర్ చేయడం ద్వారా సమయాన్ని సమర్థంగా
వినియోగించుకోవచ్చు.
సి) జనరల్ ఇంగ్లిష్
ఇంగ్లిష్ భాషపై అభ్యర్థికి ఉన్న అవగాహనా సామర్థ్యాన్ని ఈ
విభాగం ద్వారా పరిశీలిస్తారు. దీన్లో ఇంగ్లిష్ భాష ప్రాథమిక అంశాలు,
ఒకాబ్యులరీ, గ్రామర్, సెంటెన్స్ స్ట్రక్చర్, సినానిమ్స్, యాంటోనిమ్స్ -
కరెక్ట్ యూసేజీ, రైటింగ్ ఎబిలిటీ తదితర అంశాలుంటాయి.
ప్రిపరేషన్
జనరల్ ఇంగ్లిష్ విభాగంలో 50 ప్రశ్నలు ఉన్నా ప్రాథమిక
స్థాయిలోనే ఉంటాయి. సహజంగా ఇంగ్లిష్ పేపర్ అంటే తెలుగు మీడియం అభ్యర్థులే
కాదు ఇతరులు కూడా భయపడతారు. దీన్లో ఎక్కువ మార్కుల కోసం భాషపై పూర్తి పట్టు
సాధించాల్సిన అవసరం లేకపోయినా, కొంచెం ఎక్కువ శ్రద్ధ చూపాలి. పరీక్షలో ఈ
విభాగం నుంచి ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయో గమనించాలి. తర్వాత అలాంటి వాటిని
సాధన చేసేందుకు కృషి చేయాలి. ఇబ్బంది ఎదురైనప్పుడు వాటికి సంబంధించిన
గ్రామర్ విభాగం బాగా చదవాలి. కాంప్రహెన్షన్లో ప్రశ్నలు సాధించడానికి
వేగంగా చదివి, అర్థం చేసుకునే నేర్పును సంపాదించాలి. మొదట ప్రశ్నలు చదివి
తర్వాత ప్యాసేజ్ చదివితే జవాబులు వేగంగా గుర్తించడానికి అవకాశం ఉంటుంది.
డి) జనరల్ అవేర్నెస్
సమాజంలో జరుగుతున్న సంఘటనలపై అభ్యర్థికి ఉన్న అవగాహనను
పరిశీలించడమే ఈ విభాగం ముఖ్య ఉద్దేశం. దీన్లో రోజువారీ సంఘటనలు వాటిని
అభ్యర్థి గమనిస్తున్న తీరు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో చోటుచేసుకుంటున్న
మార్పులు తదితర అంశాలపై అభ్యర్థికి ఉన్న ఆసక్తి తదితర అంశాలను
పరిశీలిస్తారు. దీన్లో భారతదేశం - విదేశీ సంబంధాలు, భారత దేశ చరిత్ర,
సంస్కృతి, జాగ్రఫీ, ఆర్థిక వృద్ధి, భారత రాజ్యాంగం, శాస్త్ర సాంకేతిక రంగాల
పురోగతి మొదలైన అంశాలపై ప్రశ్నలు ఉంటాయి.
ప్రిపరేషన్
జనరల్ అవేర్నెస్కు కూడా 50 మార్కులు కేటాయించారు కాబట్టి
దీనిపై కూడా ఎక్కువ శ్రద్ధ చూపాలి. జనరల్ అవేర్నెస్ విభాగం సన్నద్ధత ఒక
నిరంతర ప్రక్రియ. ఎప్పటికప్పుడు సమాచారాన్ని అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఈ
విభాగంలో ముఖ్యమైంది, కీలకమైంది కరెంట్ అఫైర్స్. పరీక్ష తేదీకి ఆరు నెలల
ముందు నుంచి సంవత్సర కాలంలో జరిగిన అంశాల సమాహారమే కరెంట్ అఫైర్స్.
ముఖ్యంగా వార్తల్లోని వ్యక్తులు, వార్తల్లో ప్రదేశాలు, జనాభా లెక్కలు,
సదస్సులు - సమావేశాలు, రాష్ట్రీయం, జాతీయం, అంతర్జాతీయం, క్రీడలు,
అవార్డులు, ఆర్థిక రంగం మొదలైన వాటిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి.
దీనికోసం ఒక తెలుగు, ఇంగ్లిష్ దినపత్రికను రోజూ చదివి ప్రధానమైన పాయింట్లపై
నోట్స్ తయారుచేసుకోవాలి. దినపత్రికలతోపాటు పరీక్ష విధానంలో మెటీరియల్ను
అందించే ప్రధాన మ్యాగజీన్ను కూడా చదవాలి. వర్తమాన ఆర్థిక, రాజకీయ భౌగోళిక,
సాంస్కృతిక అంశాలను క్షుణ్ణంగా చదవాలి. ఇక భారత రాజకీయ వ్యవస్థను అర్థం చేసుకోవడానికి ఆరు నుంచి పదో తరగతి వరకు ఉన్న సోషల్ స్టడీస్ను పూర్తిగా రివిజన్ చేయాలి. భారత ఆర్థిక వ్యవస్థ గురించి తెలుసుకోవడానికి ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రధాన ఆర్థిక పథకాలు, ప్రణాళికలు, లక్ష్యాలు, ద్రవ్యోల్బణం మొదలైనవి చదవాలి. శాస్త్ర సాంకేతిక అంశాలకు సంబంధించి వర్తమాన పరిణామాలను బాగా అర్ధం చేసుకోవాలి. దేశంలోని ప్రతిష్టాత్మక పరిశోధన సంస్థలపైన, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన భారతీయ శాస్త్రజ్ఞులపైన ప్రశ్నలు వస్తాయి కాబట్టి ఆ వివరాలను కూడా తెలుసుకోవాలి.
గుర్తుంచుకోండి
రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం.
దరఖాస్తు:
ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి. ఇందులో పార్ట్-1, పార్ట్-2 ఉంటాయి.
వెబ్సైట్:
http://ssc.nic.in
http://www.ssconline.nic.in
తాజా నోటిఫికేషన్ వివరాలు
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇటీవలే మల్టీ
టాస్కింగ్ (నాన్-టెక్నికల్) స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ
చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: డిసెంబరు 7.
రాత పరీక్ష తేదీలు: 2013 మార్చి 10, 17.
No comments:
Post a Comment